పిక్చర్ అబీ బాకీ హై..
దాయాదిపై దండయాత్ర
పాక్పై అప్రకటిత యుద్ధం..!!
రెచ్చగొట్టి…చిచ్చుపెట్టి… చావుదెబ్బ తిని..
పాక్ దుస్సాహాసానికి ధీటుగా జవాబిస్తున్న ఆర్మీ…
కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్…
సరిహుద్ద ప్రాంతాలను టార్గెట్ చేసి… ధ్వంసానికి విఫలయత్నం చేసి… మట్టికరిచిన పాక్
ఇండియన్ ఆర్మీ దాడులకు పారిపోయిన పాకిస్తాన్ పీఎం..
వాస్తవం ప్రతినిధి – ఢిల్లీ
రెచ్చగొట్టి చిచ్చుపెట్టి చివరకు చావుదెబ్బతింటోంది పాక్. దాయాదిపై మోడీ దయలేని దండయాత్ర కొనసాగుతోంది. ఉగ్రవాదులకు పుట్టిల్లైన పాకిస్తాన్ పట్ల ప్రపంచం మొత్తం థూ అని ఊంచినా అది నాకేటి సిగ్గు అనే విధంగానే ప్రవర్తిస్తోంది. ఆపరేషన్ సిందూరులో జరిగిన దాడిలో హతమైన ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారికంగా అత్యక్రియలు జరపడం వారిని అమరులుగా కీర్తించడం ఆ దేశ నైజాన్ని మరోసారి అద్దం పట్టింది. అప్పటికీ ఇండియన్ ఆర్మీ చాలా సంయమనంతో ముందుకు సాగుతోంది. లక్షిత దాడులు కేవలం ఉగ్రమూకలు, వారి స్థావరాలే లక్ష్యంగా సాగించింది. కానీ పాక్ ఇండియా సరిహద్దులను టార్గెట్ చేసింది. భారతీయులను మట్టుబెట్టడం మొదలుపెట్టింది. ఇక ఊరుకుంటుందా ఇండియన్ ఆర్మీ. ఓ వైపు ఆపరేషన్ సిందూర్ ప్రణాళికలు కొనసాగుతున్నారు. దాడులకు స్పాట్ పెట్టే ముహూర్తం ఫిక్స్ అవుతోంది.
మరోవైపు పాక్ చేస్తున్న దాడులను తిప్పికొట్టి అదే రేంజ్లో పాకిస్తాన్ను చిన్నాభిన్నం చేసే దిశగా ఆర్మీ చర్యలు దూకుడుగా కొనసాగుతున్నాయి. ఓ రకంగా ఈ ఇరు దేశాల్లో అప్రకటిత యుద్దం కొనసాగుతోంది. జాతి యావత్ ఆసక్తిగా గమనిస్తోంది. పాకిస్తాన్కు ఇంకా ఇంకా గట్టి గుణపాఠం చెప్పాలనే కసితో ఉన్నది దేశం. ప్రపంచదేశాలు కూడా భారత్కే మద్దతుగా నిలుస్తున్నాయి. పిక్చర్ అబీ బాకీ హై అన్నట్గుగానే ఆర్మీ యాక్షన్ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు మోడీ పరిస్థితులను సమీక్షిస్తూ దాయాదిపై దయలేని దాడి కొనసాగుతోంది. నిత్యం రాత్రి దీపావళి కాంతులే కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ మిస్సైల్ వచ్చి పక్కన పడుతుందో తెలియని భయంకర వాతవారణం పాకిస్తాన్లో నెలకొని ఉంది. దీనంతటికీ కారణం పాక్ కవ్వింపు చర్యలే. దాడులకు విఫలయత్నం చేసి ఎదురు తన్నించుకుని చావు దెబ్బ తింటోంది. ఇక ఈ యుద్దం మరింత భీకరంగా , బీభత్సంగా మారనుందే తప్ప తగ్గేలా లేదు. ఇండియన్ ఆర్మీ దూకుడుకు పాక్ కకావిలకమైంది. అబీ పిక్చర్ బాకీ హై.