వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
ప్రశాంత్రెడ్డిని మేం కొనలేం.. ఈ మాటలన్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎక్కడ..? అసెంబ్లీ లాబీలో. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లాబీలో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. సభ్యుల మధ్య ఆసక్తికర సంభాషణలు జరుగుతూ ఉంటాయి.
ఇదీ అలాగే జరిగింది. బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి పోతుంటే ఇంకా ఎంత మంది మిగిలారు..? ఎంత మంది వెళ్తారు..? చివరకు ఎవరుంటారు.? అనే డిస్కషన్ అక్కడ జరుగుతున్నది. దీనికి తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందర్నీ లాగుతున్నాం. కానీ కొందరున్నారు.
వారిని మేం తీసుకురాలేం. ప్రశాంత్రెడ్డి లాంటి లీడర్లను మేం కొనజాలం అని సూటిగా సుత్తిలేకుండా చెప్పుకొచ్చాడు. ఇదిప్పుడు హాట్టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో బాల్కొండ బీఆరెస్ శ్రేణులు దీన్ని ఉటంకిస్తూ కామెంట్లు చేస్తున్నారు. దటీజ్ ప్రశాంత్ రెడ్డి అంటూ కొనియాడుతున్నారు.