ఎస్సారెస్పీ పునరుజ్జీవం నీళ్లు బంగాళఖాతంలోకి! రూ.2వేల కోట్లు కాంట్రాక్టర్ల జేబుల్లోకి!! మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డిని టార్గెట్ చేసిన కవిత!! ఇరిగేషన్ చరిత్రలోనే ఇది అత్యంత అవినీతి ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు ద్వారా పోచంపాడును నింపామన్న ప్రశాంత్రెడ్డి మాటలు పచ్చి అబద్దం..! ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కాళేశ్వరం ద్వారా నయాపైస లాభం లేదు.. హరీశ్ తరువాత ఇప్పుడు ప్రశాంత్రెడ్డిని టార్గెట్ చేసిన తెలంగాణ జాగృతి..
(దండుగుల శ్రీనివాస్) కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద అవినీతి అని సర్కార్ తేల్చిపారేసిన సందర్భంలో కవిత కూడా దీనికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఇంత అవినీతి జరగడానికి కారణం హరీశ్రావేనని ఆమె తేల్చిపారేసింది. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో…
